లక్నో, ఆగస్టు 19: బీహార్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు దేశ రాజకీయాలకు ఓ ‘సానుకూల సంకేతం’ అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడుతుందని, దీనికి ప్రజలు మద్దతు పలుకుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావుతో పాటు బెంగాల్ సీఎం మమత, ఎన్సీపీ అధినేత శరద్పవార్ జాతీయ స్థాయిలో బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయాన్ని తీసుకువచ్చే పనిలో ఉన్నారని తెలిపారు.