న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇవాళ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం మూడు గంటల పాటు రాహుల్ను ఈడీ విచారించింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి మద్దతుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
ఈడీ కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ను కూడా పోలీసులు లాక్కెళ్లారు. ఆయనను ఎత్తుకెళ్లి పోలీసు వాహనంలో ఎక్కించారు. అయితే ఈ దృశ్యాలను యూత్ కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్ బీవీ చిత్రీకరించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. రాజ్యసభ సిట్టింగ్ ఎంపీ, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పట్ల ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరు తీవ్రంగా ఖండించదగ్గ విషయమని శ్రీనివాస్ పేర్కొన్నారు. కేసీ వేణుగోపాల్ను అరెస్టు చేసి తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్కు తరలించారు.
This behaviour of Delhi Police with a sitting Rajya Sabha MP and AICC General Secretary @kcvenugopalmp ji is highly condemnable. pic.twitter.com/nWQ3btjxDP
— Srinivas BV (@srinivasiyc) June 13, 2022