ముంబై : విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ (Katrina Kaif) బాలీవుడ్ క్రేజీ కపుల్గా పేరొందారు. 2021లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట మ్యారీడ్ లైఫ్ను ఆస్వాదిస్తోంది. ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న విక్కీ కౌశల్ కత్రినా గురించి పలు వివరాలు వెల్లడించాడు. వారిద్దరికీ ఇష్టమైన ఫుడ్ గురించి చెప్పుకొచ్చాడు. గతంలో తనకు పాన్కేక్స్ గురించి పెద్దగా తెలియదని, ఇప్పుడు తాను వాటిని ఇష్టపడుతున్నానని కొన్ని అలా జరుగుతుంటాయని అన్నాడు.
గతంలో తనకన్నా ఎక్కువ పేరున్న కత్రినా కైఫ్ను తాను ఎలా కలుసుకున్నాననేది కూడా ఇటీవల విక్కీ కౌశల్ వెల్లడించాడు.కత్రినాలో మానవత్వం ఎక్కువని ఆ గుణాన్ని చూసే తాను ఆమెతో ప్రేమలో పడ్డానని చెప్పాడు. ముందుగా ఆమె దృష్టిని ఆకర్షించేందుకు ఇబ్బంది పడేవాడినని, అయితే ఆమె అద్భుతమైన వ్యక్తని, ఒకసారి ఆమెతో కొద్ది సమయం గడిపిన తర్వాత తానింతవరకూ ఆమెలాంటి వ్యక్తిని కలవలేదని తెలుసుకున్నానని తెలిపాడు.
ఆమె తన చుట్టూ ఉన్న వారి పట్ల ఎంతో కేరింగ్గా ఉంటారని అన్నాడు. అదే ఆమెలో తనకు నచ్చిన గుణమని అన్నాడు. రెండేండ్ల డేటింగ్ అనంతరం కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2021 డిసెంబర్లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్ధాన్లోని సవై మధోపూర్లో అత్యంత ఆడంబరంగా వారి పెండ్లి వేడుక జరిగింది. కుటుంబసభ్యులు, కొద్దిమంది సినీ పరిశ్రమకు చెందిన స్నేహితుల సమక్షంలో ప్రైవేట్ వెడ్డింగ్ వేడుక నిర్వహించారు.
Read More :
Singham Again | సింగం ఎగైన్ షూటింగ్ ప్రారంభం.. ఈ సారి మరింత స్పైసీగా..!