Terrorists | జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో ఉగ్రవాదులు (Terrorist) పేట్రేగిపోతున్నారు. గత కొన్ని నెలలుగా భద్రతా బలగాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. లోయ ప్రాంతాల్లో దాక్కుని భద్రతా బలగాలను దొంగదెబ్బ తీసేందుకు కుట్ర పన్నుతున్నారు. వారి దాడుల్లో ఎంతో మంది జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను కట్టడి చేసేందుకు అక్కడి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే అనుమానిత ఉగ్రవాదుల ఫొటోలను రిలీజ్ చేసి రివార్డులు ప్రకటిస్తున్నారు.
తాజాగా నలుగురు ఉగ్రవాదులకు చెందిన ఊహాచిత్రాలను (sketches of 4 terrorists) కథువా పోలీసులు (Kathua Police) శనివారం ఉదయం రిలీజ్ చేశారు. జిల్లాలోని మల్హర్, బని, సియోజ్ ధర్ లోయ ప్రాంతాల్లో కనిపించిన ఉగ్రవాదుల ఊహాచిత్రాలను గీసి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వారిని పట్టుకునేందుకు రివార్డు కూడా ప్రకటించారు (Reward Announced). ఫొటోల్లో ఉన్న ఉగ్రవాదుల గురించిన సమాచారం అందించిన వారికి రూ.5లక్షల నగదు బహుమతి ప్రకటించారు.
Kathua Police releases sketches of 04 terrorists who were last seen in dhoks of Malhar , Bani & Seojdhar. A reward of 05lakhs on each terrorist for an actionable information. Anyone with credible information of terrorists will also be suitably rewarded.@JmuKmrPolice
@ZPHQJammu pic.twitter.com/FsBG1qdZdt— Kathua Police (@KathuaPolice) August 10, 2024
Also Read..
Tihar jail official | సర్వీస్ తుపాకీతో డ్యాన్స్.. తీహార్ జైలు అధికారిపై వేటు
Manish Sisodia | కేజ్రీవాల్ కూడా త్వరలోనే జైలు నుంచి విడుదలవుతారు : మనీశ్ సిసోడియా
Israeli | గాజా పాఠశాలపై ఇజ్రాయెల్ దాడులు.. 100 మంది మృతి