బెంగళూరు, ఏప్రిల్ 17: ఆయనో ఎమ్మెల్యే.. ఆయన భార్యకు టికెట్, మరొకరు ఎంపీ.. ఆయన కోడలికి టికెట్, ఇంకొకరు మాజీ మంత్రి.. ఆయన కొడుకుకు టికెట్. బీజేపీ విడుదల చేసిన కర్ణాటక అభ్యర్థుల మూడో లిస్టులో వారసుల జాబితా ఇది. పది మందితోనే జాబితా విడుదల చేసినా, అందులో మూడు టికెట్లు కుటుంబసభ్యులకే ఇవ్వడం గమనార్హం. పార్టీ ఎంపీ కరాడి సంగన్న కోడలు మంజుల అమరేశ్, మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్య నాయుడు కుమారుడు కట్టా జగదీశ్కు, ఎమ్మెల్యే అరవింద్ లింబావలి భార్య మంజులకు కమలం పార్టీ టికెట్లు ఇచ్చింది. విపక్ష పార్టీలన్నీ కుటుంబ పాలన సాగిస్తాయంటూ ఆరోపణలు చేసే బీజేపీ పెద్దలు.. తమ పార్టీలో మాత్రం బంధుప్రీతి చూపించటంపై పార్టీ నేతలే భగ్గుమంటున్నారు.