బెంగళూరు: భార్య తనను కొట్టిందంటూ కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి ఆరోపించాడు. ప్రధాని కార్యాలయానికి దీనిపై ఫిర్యాదు చేశాడు. బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య, అక్టోబర్ 29న ఈ మేరకు ట్వీట్ చేశాడు. ‘నాకు ఎవరైనా సహాయం చేస్తారా? ఎందుకంటే నేను పురుషుడ్ని’ అని ఆచార్య అందులో పేర్కొన్నారు. ‘నా భార్య నాపై కత్తితో దాడి చేసింది. మీరు గొప్పగా చెప్పే నారీ శక్తి ఇదేనా? నేను ఆమెపై గృహ హింస కేసు పెట్టవచ్చా? లేదా?’ అని ఆ ట్వీట్లో ఆ ప్రశ్నించాడు. తన చేతి నుంచి రక్తం కారుతున్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. తన భార్య కత్తితో పొడిచిందని ఆచార్య ఆరోపించాడు. చంపుతానని తనను బెదిరిస్తున్నదంటూ భయాందోళన వ్యక్తం చేశాడు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డికి కూడా ఈ ఫ్యిరాదు ట్వీట్ను ట్యాగ్ చేశాడు.
కాగా, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి దీనిపై స్పందించారు. సమీప పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసి న్యాయ సహాయం పొందవచ్చని యదునందన్ ఆచార్యకు ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు. మరోవైపు నెటిజన్ల నుంచి కూడా ఆచార్యకు మద్దతు లభిస్తున్నది. భార్యల నుంచి భర్తలు ఎదుర్కొనే వేధింపులను పరిగణించాలని, వీటిపై సీరియస్గా స్పందించి చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు.
Would anyone help me? Or did anyone help me when this happened?
No, Because I am a man!
My wife attacked me with knife, Is this the naari shakti you boost about? Can I put a domestic violence case against her for this? No!@PMOIndia @KirenRijiju @NyayPrayaas@CPBlr#MenToo pic.twitter.com/VNqtTQ5kPK— Yadunandan Acharya (@yaadac) October 29, 2022