బెంగళూరు, ఆగస్టు 11: కర్ణాటక యాంటి కరప్షన్ బ్యూరో(ఏసీబీ)ను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏసీబీ ఆధ్వర్యంలో ఉన్న కేసులు, సిబ్బంది, అధికారులను లోకాయుక్తకు బదిలీ చేసింది. లోకాయుక్త సమర్థంగా నడవటానికి సమర్థులైన అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
2016 మార్చి 16న ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీని ఏర్పాటు చేస్తూ, లోకాయుక్త అధికారాలకు కత్తెర వేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఏసీబీని రద్దు చేసింది.