Bengaluru | బెంగళూరు: బెంగళూరు పేరెత్తగానే అందరికీ గుర్తుకు వచ్చేది ట్రాఫిక్ వెతలు. గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయి నగరవాసులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
ఇప్పుడు ఆ ట్రాఫిక్ సమస్య నుంచి నగర ప్రజలకు విముక్తి కల్పించడానికి 190 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ (సొరంగ) రహదారిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. దీని ద్వారా నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 45 రోజుల్లో టెండర్లను ఆహ్వానించనున్నట్టు వెల్లడించారు.