బెంగళూరు: కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఇవాళ ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని బీసీ నగేశ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను క్వారెంటైన్లో ఉన్నానని, అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటూ, సంబంధిత మెడికేషన్ తీసుకుంటున్నానని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వాళ్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.