CM Siddaramaiah | మైసూర్: ఇకపై తాను ఏ ఎన్నికల్లో పోటీచేయబోనని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మంగళవారం పేర్కొన్నారు. మైసూర్లో ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ నుంచి మరోసారి పోటీచేయాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ‘ప్రస్తుతం నా వయసు 77 ఏండ్లు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి 81-82 ఏండ్లు వస్తా యి. అప్పుడు నా ఆరోగ్యం సహకరించదు. ఉత్సాహంగా పనిచేయగలనా? ఇక చాలు’ అని అన్నారు.