మైసూరు, జనవరి 25: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. కావేరీ జలాలతో 150 సరస్సులను నీటితో నింపే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో సాంకేతిక సమస్య వల్ల ఆయన నొక్కి ప్రారంభించాల్సిన మోటార్ బటన్ పని చేయలేదు. దీంతో ఆయన రబ్బర్ తొడుగు వేసుకొని మరీ దాన్ని పలుమార్లు నొక్కారు. కానీ ఫలితం లేకపోయింది.
దీంతో సీఎంకు ఇబ్బంది కలిగించారనే కారణంతో మైసూరు కరెంట్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎన్ శ్రీధర్ సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో, ప్రాజెక్ట్ నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రారంభోత్సవానికి హాజరు కాకపోవడం వల్ల ఆయనను సస్పెండ్ చేసినట్టు మైసూరు కలెక్టర్ తెలిపారు. మీడియా సమక్షంలో పెరియ పట్టణ తాలుకా ముత్తిన ముల్లుసోగె గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.