బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 24 మంది ఎమ్మెల్యేలకు తన మంత్రివర్గంలో చోటుకల్పించారు. గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. కర్ణాటక రాజ్భవన్లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఈ నెల 20న సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అదేవిధంగా మరో 8 మంది కీలక నేతల చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. తాజాగా మరో 24 మంది మంత్రివర్గంలో చేరారు. కొత్తగా కర్ణాటక మంత్రివర్గంలో చేరిన వారిలో హెచ్కే పాటిల్, కృష్ణ బైరెగౌడ, దినేశ్ గుండూరావు, క్యాథసంద్ర ఎన్. రాజన్న, దర్శనపూర్ శరనబసప్ప, శివానంద్ పాటిల్, ఎన్ చలువరాయ స్వామి, కే వెంకటేశ్, డా.హెచ్సీ మహదేవప్ప, ఈశ్వర్ ఖంద్రే, తిమ్మాపూర్ రామప్ప బాలప్ప, ఎస్ఎస్ మల్లికార్జున్, శివరాజ్ సంగప్ప తంగడగి, డా. శరనప్రసాద్ రుద్రప్ప పాటిల్, మంకాల్ వైద్య, లక్ష్మీ హెబ్బాల్కర్, రహీమ్ ఖాన్, డీ సుధాకర్, సంతోష్ ల్యాడ్, ఎన్ఎస్ బోసెరాజు, సురేష బీఎస్, మధు బంగారప్ప, డా.ఎంసీ సుధాకర్, బీ నాగేంద్ర తదితరులు ఉన్నారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటే 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినా ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి శాఖలు కేటాయించలేదు. ఇప్పుడు మరో 24 మందితో మంత్రివర్గాన్ని విస్తరించినందున ఇక అందరీకి ఒకేసారి శాఖలు కేటాయించే అవకాశం ఉంది. కాగా, కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. 13న ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలను తన ఖాతాలో వేసుకుని ఘన విజయం సాధించింది.
Karnataka Cabinet expansion | Bengaluru: Congress leader HK Patil, Krishna Byregowda take oath as Karnataka Minister pic.twitter.com/VM6d9OLRT8
— ANI (@ANI) May 27, 2023
Karnataka Cabinet expansion | Bengaluru: Congress leaders Santosh Lad, NS Boseraju, Suresha BS, and Madhu Bangarappa take oath as Karnataka Minister pic.twitter.com/w8UK3Rmwyl
— ANI (@ANI) May 27, 2023