న్యూఢిల్లీ : మసీదుల నుంచి వినిపించే ఆజాన్పై కర్నాటక (Karnataka Polls) బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈశ్వరప్ప మాట్లాడుతూ తాను ఎక్కడికి వెళ్లినా తనకు ఆజాన్ తలనొప్పిలా మారిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో త్వరలోనే ఇది సమసిపోతుందని మాజీ మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు.
Karnataka | Wherever I go this (Azaan) is a headache for me. No doubt this will end soon as there is a SC judgement. PM Modi asked to respect all religions, but I must ask can Allah hear only if you scream on a microphone? : BJP MLA KS Eshwarappa in Mangaluru (12.03) pic.twitter.com/WOBHPExTvm
— ANI (@ANI) March 13, 2023
అన్ని మతాలను గౌరవించాలని ప్రధాని మోదీ చెబుతారని, అయితే మీరు మైక్లో పెద్దగా అరిస్తేనే అల్లాకు వినపడుతుందా అని తాను అడగదలచుకున్నానని ఈశ్వరప్ప అన్నారు. మార్చి 22న రంజాన్ ప్రారంభం కానుండగా రాష్ట్ర మాజీ హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మేలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకే బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని విపక్ష నేతలు భగ్గుమన్నారు. కాగా బహిరంగ స్ధలాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్స్పీకర్లు, మ్యూజిక్ సిస్టమ్స్ను వాడటాన్ని సుప్రీంకోర్టు 2005 జులైలో నిషేధించింది. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆరోగ్యంపై శబ్ధ కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతాయని సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొంది. ఇక మసీదుల్లో లౌడ్స్పీకర్లను నిషేధించాలని కోరుతూ హైకోర్టుల్లో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పీఐఎల్) నమోదయ్యాయి.
Read More :