అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి 74 ఏండ్ల వయసు వచ్చినా కూడా చేసిన తప్పులపై ఆయనలో కనీసం పశ్చాతాపం కనిపించడం లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) విమర్శించారు. మంగళవారం కడప జిల్లా మైదుకూరులో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 58 నెలల వైసీపీ(YCP) పాలలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, గ్రామ గ్రామన ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలను అందించామని వెల్లడించారు.
చంద్రబాబు (Chandra Babu) కు ఓటేయడమంటే మళ్లీ మోసపోవడమేనని అన్నారు. జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయిని, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఏనాడూ మంచి చేసిన చరిత్ర లేదని అన్నారు. 2014లో ఇంటింటికి జాబ్ , నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధి విషయంలోనూ బోగస్ రిపోర్టు (Bogus Report) ఇచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓటేసే ముందు ఎవరిది బోగస్ రిపోర్టు, ఎవరిది ప్రోగెస్ రిపోర్టు అనేది చూడాలని సూచించారు.ఈ ఎన్నికలు పేదల భవిష్యత్తులను నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చామని వివరించారు.