హైదరాబాద్ : రాయదుర్గంలో(Rayadurgam) పేకాట స్థావరంపై(Poker camp) ఎస్వోటీ పోలీసులు(Sot police )దాడులు నిర్వహించారు. పేకాట నిర్వాహకు రాలు మాధవి సహా 9 మంది జూదరులను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 11 సెల్ఫోన్లు, రూ.62 వేలు స్వాధీనం చేసుకున్నారు. గేమింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, మాధవి వ్యాపారులే లక్ష్యంగా పేకాట స్థావరం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పేకాట శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.