బెంగళూరు, ఏప్రిల్ 3: ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కర్ణాటకలోని కుడ్లిగి నియోజకవర్గ ఎమ్మెల్యే గోపాలకృష్ణ కాంగ్రెస్లో చేరారు. వచ్చే నెల 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు గోపాలకృష్ణ అధికార బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ గోపాలకృష్ణ బీజేపీని కాదని కాంగ్రెస్లో చేరడంతో అధికార పవనాలు ఎటువైపు వీస్తున్నాయో అర్థమవుతున్నదని చెప్పారు. త్వరలో జేడీఎస్కు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా చేరుతారన్నారు.