న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఢిల్లీలో 2020లో చోటుచేసుకొన్న అల్లర్ల కేసులో జేఎన్యూకి చెందిన విద్యార్థి నేతలు ఉమర్ ఖలీద్, ఖలీద్ సైఫీని ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. చాంద్బాగ్ అల్లర్ల కేసులో వారి ప్రమేయం లేదని పేర్కొంటూ, బెయిల్ మంజూరు చేసింది.
ఆ అల్లర్లలో రాళ్లు రువ్వారని పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. అల్లర్లకు కుట్ర పన్నారన్న అభియోగాలు మోపారు. అయితే, అందుకు ఆధారాలు లేవని కోర్టు కేసును కొట్టేసింది.