న్యూఢిల్లీ: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను సీనియర్ కాంగ్రెస్ నేత డాక్టర్ కరణ్ సింగ్(Karan Singh) తీవ్రంగా ఖండించారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమన్నారు. ఆ వ్యాఖ్యలను ఆమోదించడం లేదన్నారు. ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు.. కొద్దో గొప్పో సనాతన ధర్మాన్ని పాటిస్తుంటారని, ఇక సనాతన ధర్మానికి చెందిన ఎన్నో ప్రఖ్యాత ఆలయాలు తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయని కరణ్ సింగ్ తెలిపారు. ఉదయనిధి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ఓ లేఖను రిలీజ్ చేశారు. తంజావూరు, శ్రీరంగం, తిరువన్నమలై, చిదంబరం, మధురై, సుచింద్రమ్, రామేశ్వరం లాంటి ఎన్నో పెద్ద పెద్ద ఆలయాలు తమిళనాడులో ఉన్నట్లు ఆయన తెలిపారు.ఓ రాజకీయ వేత్త ఇలాంటి షాకింగ్ వ్యాఖ్యలు చేయడం అర్థరహితమన్నారు. తమిళ సంస్కృతి పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందని, ఉదయనిధి స్టాలిన్ ఇచ్చిన స్టేట్మెంట్ను వ్యక్తిగతంగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు కరణ్ సింగ్ తెలిపారు.
PHOTO | Congress leader and former Union minister Karan Singh criticises Udhayanidhi Stalin's remarks on 'Sanatan Dharma'. pic.twitter.com/uqqjuop1bw
— Press Trust of India (@PTI_News) September 4, 2023