న్యూఢిల్లీ: తృణామూల్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలియని రీతిలో ఉన్నది. పార్టీ చీఫ్ మమతా బెనర్జీకి ఆ పార్టీ సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ(Kalyan Banerjee) అల్టిమేటం జారీ చేశారు. మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కావాలా లేక తన లాంటి సీనయర్ నాయకులు కావాలో మమత తేల్చుకోవాలని ఆయన అన్నారు. నేను మమతా బెనర్జీతోనే ఉన్నాను, కానీ దీదీ.. అభిషేక్తో ఉందా లేక టీఎంసీతో ఉందా అన్న విషయాన్ని ఆమెనే తేల్చుకోవాలని కళ్యాణ్ బెనర్జీ అన్నారు. టీఎంసీ పార్టీలో ఇటీవల ముసలం చెలరేగిన విషయం తెలిసిందే. కొందరు రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే ఆ పార్టీని వీడారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ పార్టీ చావుదెబ్బతిన్న విషయం తెలిసిందే.
ఇక రాబోయే రోజుల్లో న్యాయపరమైన అంశాల్లో అభిషేక్ బెనర్జీ తరపున తాను వాదించబోను అని కళ్యాణ్ బెనర్జీ స్పష్టం చేశారు. ఫోర్జరీ కేసులో బెంగాల్ సీఐడీ అభిషేక్కు సమన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కళ్యాణ్ బెనర్జీ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ కేసులో అభిషేక్ బెనర్జీ తరపున న్యాయవాది అయాన్ భట్టాచార్య వాదించారు. జస్టిస్ కౌషిక్ చాంద్ ధర్మాసనం ఆ కేసును విచారించింది. ఈ కేసులో అభిషేక్ తన పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు.
అభిషేక్ బెనర్జీ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అభిషేక్ కేసును బెంచ్పై త్వరగా తీసుకొచ్చేందుకు జస్టిస్ చాంద్ను కోరానని, కానీ ఈలోగా మరో చిన్న లాయర్ను అతను మాట్లాడుకున్నాడని కళ్యాణ్ ఆరోపించారు. ప్రతి ఒక్కరూ తనకన్నా చిన్నవారే అన్న అహంకారం అభిషేక్కు ఉందని కళ్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు.
Kolkata, West Bengal: TMC MP Kalyan Banerjee says, “I am with the Mamata Banerjee. But Mamata Di has to decide whether Mamata Di will keep Abhishek or keep myself…Mamata Di has to decide first. Mamata Di has to first decide that she cannot move the party without Abhishek… pic.twitter.com/HIq0zDoy06
— IANS (@ians_india) June 11, 2026