న్యూఢిల్లీ : కక్ష సాధింపు రాజకీయాలను తాను విశ్వసించనని కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) స్పష్టం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ల పట్ల తనకు ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. తాను సీఎం పదవి రేసులో ఎన్నడూ లేనని, మధ్యప్రదేశ్ అభివృద్ధి కోసమే పనిచేస్తానని పేర్కొన్నారు.
తాను విరాట్ కోహ్లి, వీరేందర్ సెహ్వాగ్లా ఆడతానని, విరాట్, సెహ్వాగ్లా తాను ఆడకుంటే 2020 (మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సర్కార్ పతనం) పరిణామాలు జరిగేవి కావని గుర్తుచేశారు. తాను గతాన్ని తవ్వదలుచుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ను వీడాలన్న నిర్ణయం గట్టి సందేశమని అభివర్ణించారు. బీజేపీలో పదవులను కట్టబెట్టే సంస్కృతి లేదని, కష్టించి పనిచేస్తేనే పార్టీ నాయకత్వం గుర్తిస్తుందని అన్నారు.
మధ్యప్రదేశ్లో తాను కాంగ్రెస్లో ఉన్న సమయంలో పార్టీ సర్కార్ ప్రజల ఆశలను వమ్ముచేసిందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోవడంతో తాను వీధుల్లోకి రావాల్సి వచ్చిందని అన్నారు. 2020 మార్చిలో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేసి 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరడంతో మధ్యప్రదేశ్లో నాటి కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాగా, ఆపై సింధియాను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకున్నారు.
Read More :
Nuh violence | నుహ్ అల్లర్ల కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్