స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ : దేశవ్యాప్తంగా 30 ఏళ్లకు పైబడి జిల్లా, తాలుకా దిగువ కోర్టుల్లో లక్ష పై చిలుకు కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ నాలుగు రాష్ర్టాలలోనే 91 వేల కేసులు ఉండటం గమనార్హం.
కాగా దేశ జనాభాలో 42 శాతం కలిగి ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలోనే 90 శాతం కేసులు పెండింగ్లో ఉండటం శోచనీయం. తెలంగాణ కంటే 13 రాష్ర్టాలలో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య ఎక్కువ.