న్యూఢిల్లీ, నవంబర్ 8: సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయిస్తారు.
జస్టిస్ చంద్రచూడ్ ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 2024 నవంబర్ 10 వరకు అంటే సరిగ్గా రెండేండ్లపాటు సీజేఐగా కొనసాగుతారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ మంగళవారం పదవీ విరమణ చేశారు.