CJI DY Chandrachud | సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ రెండేండ్ల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన జస్టిస్ వైవీ చంద్రచూడ్ తనయుడే జస్టిస్ డివై చంద్రచూడ్. 1978 ఫిబ్రవరి 22 నుంచి 1985 జూలై 11 వరకు సుదీర్ఘకాలం వైవీ చంద్రచూడ్.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పని చేశారు.
జస్టిస్ డీవై చంద్రచూడ్ 2024 నవంబర్ 10 వరకు సీజేఐగా కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ 2016 మే 13వ తేదీన పదోన్నతి పొందారు. అంతకుముందు అలహాబాద్, బాంబే హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 1998-2000 మధ్య జస్టిస్ డీవై చంద్రచూడ్.. అదనపు సొలిసిటర్ జనరల్గా పనిచేశారు.
అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భవిచ్చితి తదితర కేసులపై చారిత్రక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యుడిగా ఉన్నారు. ఇంకా ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించారు. కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి అనుమతి వంటి కీలక తీర్పులిచ్చారు.
49వ సీజేఐగా పని చేసిన ఉదయ్ ఉమేశ్ లలిత్ (యూయూ లలిత్).. తన తర్వాత చీఫ్ జస్టిస్గా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును కేంద్ర ప్రభుత్వానికి గత నెల 11న సిఫారసు చేశారు. గత నెల 17న జస్టిస్ డీవై చంద్రచూడ్ను దేశ 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
1959 నవంబర్ 11న జన్మించిన చంద్రచూడ్.. న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఎకనమిక్స్లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలోని క్యాంపస్ లా సెంటర్లో ఎల్ఎల్బీ చదివారు. అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్ఎం డిగ్రీ, జ్యురిడిషియల్ సైన్సెస్లో డాక్టరేట్ పొందారు. సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ముంబై యూనివర్సిటీలో కంపారేటివ్ కానిస్ట్యూషనల్ లా విజిటింగ్ ప్రొఫెసర్గా కూడా సేవలందించారు.