Misappropriation of Funds | కోవిడ్-19 రోగులు, వరద బాధితులకు సాయం పేరిట వసూలు చేసిన డొనేషన్లను దుర్వినియోగం చేశారన్న అభియోగంపై ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ పోలీసులు ఓ మహిళా జర్నలిస్టుపై కేసు నమోదు చేశారు. ఆ కేసులో చీటింగ్, మనీ లాండరింగ్ అభియోగాలు చేర్చారు. ఈశాన్య రాష్ట్రాల్లోని కోవిడ్-19 రోగులు, వరద బాధితులకు చేయూతనిచ్చే పేరుతో విరాళాలు సేకరించిన ఆ మహిళా జర్నలిస్టు పేరు రాణా ఆయూబ్. ఐటీ చట్టం కింద కంప్యూటర్ను ఉపయోగించి నేర పూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడ్డారన్న అభియోగాలను కూడా ఎదుర్కొంటున్నారు.
రాణా ఆయూబ్పై పోలీసులు ఈ వారం మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఘజియాబాద్ సిటీ ఎస్పీ గ్యానేంద్ర సింగ్ తెలిపారు. సదరు జర్నలిస్టుపై వచ్చిన అభియోగాలపై దర్యాప్తులో ఆధారాలు దొరికాక చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
72 ఏండ్ల బులంద్షహర్ వాసిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని పేర్కొంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఫేక్ వీడియో కేసులోనూ ఆమె పేరు ఉన్నట్లు తెలుస్తున్నది. కిడ్నాప్ చేసిన సదరు వృద్ధుడ్ని జై శ్రీరాం అనాలని కొట్టారని, గడ్డం కత్తిరించారని ఆ వీడియోలో ఉంది. కానీ సదరు వృద్ధుడు ఒక రాజకీయ కార్యకర్తగా ఈ అభియోగాలు చేశారని, అంతా బూటకం అని తర్వాత ఘజియాబాద్ పోలీసులు కనుగొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!