ముంబై: మహారాష్ట్రలో ఓ జర్నలిస్టు దారుణహత్యకు గురయ్యారు. బైక్పై వెళ్తున్న జర్నలిస్టు శశికాంత్ వారిషేను కారుతో తొక్కించి చంపేశారు. రత్నగిరి జిల్లాలోని రాజాపూర్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఇక్కడ రత్నగిరి రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ ప్రాజెక్టు ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాజెక్టుకు మద్దతు పలుకుతున్న పండరీనాథ్ అనే ల్యాండ్ డీలర్కు వ్యతిరేకంగా పత్రికలో శశికాంత్ ఓ వార్త రాశారు. అతడే శశికాంత్ను హత్య చేయించాడనే ఆరోపణలు వస్తున్నాయి.