న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ పాలనలో మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నదని జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జర్నలిస్టులు, ఇతర మీడియా వ్యక్తులపై యూఏపీఏ వంటి క్రూరమైన చట్టాల కింద కేసులు నమోదు చేస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ తొమ్మిది జర్నలిస్టు సంఘాలు రాష్ట్రపతి ముర్ముకు సోమవారం లేఖ రాశాయి. దేశంలో మీడియా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నదని పేర్కొన్నాయి. ఈ చట్టాల కింద అధికారులు ఫోన్లు, ల్యాప్టాప్లు, హార్డ్డిస్క్లు వంటి పరికరాలను స్వాధీనం చేసుకొనేందుకు అపరితమైన అధికారులు వినియోగిస్తున్నారని పేర్కొన్నాయి.
భావప్రకటనా స్వేచ్ఛతో సహా రాజ్యాంగంలోని అన్ని రకాల స్వేచ్ఛలను పరిరక్షించేందుకు జోక్యం చేసుకోవాలని జర్నలిస్టు సంఘాలు రాష్ట్రపతిని కోరాయి. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్, డిజిపబ్, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, ఏఐఎల్యూ తదితర సంఘాలు ఈ లేఖ రాశాయి. ఇటీవల ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్క్లిక్ కార్యాలయం, జర్నలిస్టుల ఇండ్లలో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.