కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఉద్యోగాల నియామకాల కుంభకోణం కేసులో పరిశ్రమల శాఖ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అరెస్టు చేసింది. ఈ సందర్భంగా ఆయన సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేశారు. అయితే అటునుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో మరో మూడుసార్లు దీదీకి ఫోన్ చేసినప్పటికీ ఆమె లిఫ్ట్ చేయలేదు. నాలుగుసార్లు ప్రయత్నించినప్పటికీ Please try after some time అనే సమాధానమే రావడంతో చేసేదేంలేక ఆయన ఈడీ అధికారుల వెంట నడిచారు.
ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన కుంభకోణంలో మంత్రి పార్థ ఛటర్జీని శనివారం తెల్లవారుజామున ఈడీ అదుపులోకి తీసుకున్నది. అయితే కుటుంబ సభ్యులకు గానీ, సంబంధీకులకు గానీ అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఎవరికి ఫోన్ చేయాలని ఈడీ అధికారులు అడగడంతో ఆయన సీఎం మమతాకు అని సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన అర్ధరాత్రి 2.31 గంలకు, 2.33 గంటలకు, 3.37 గంటలకు, ఉదయం 9.35 గంటలకు దీదీకి ఫోన్ చేశారు. అయినప్పటికీ ఆ కాల్కు ఆమె సమాధానం ఇవ్వలేదు.
విద్యాశాఖ మాజీ మంత్రి అయితన పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో ఈడీ శనివారం దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అదికారులు రూ.21 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రిని అరెస్టు చేశారు.