శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేయడాన్ని సహింబోమన్న హర్యానా సీఎం ఖట్టర్ వ్యాఖ్యలపై ఆదివారం ఆయన స్పందించారు. ఇలాంటి భారత్లో జమ్ముకశ్మీర్ విలీనం కాలేదన్నారు. ఇలాంటి నిబంధనలు ప్రతి మతంపై ఉంటే బాగుంటుందని అన్నారు. ఒక నిర్ధిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తున్నదని విమర్శించారు.
హర్యానాలోని బహిరంగ ప్రదేశాల్లో శుక్రవారం ముస్లింల సామూహిక ప్రార్థనలపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనలకు గతంలో పలు ఖాళీ ప్రదేశాలకు ఇచ్చిన అనుమతిని అధికారులు ఇటీవల రద్దు చేశారు.
మరోవైపు బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేయడాన్ని సహింబోమని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శనివారం ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా దీనిపై స్పందించారు. ఒక నిర్ధిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి భారత్లో జమ్ముకశ్మీర్ విలీనం కాలేదన్నారు.