National
- Dec 04, 2020 , 21:56:13
రైతులపై కేసులు ఎత్తివేయాలని జేజేపీ డిమాండ్

చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న హర్యానా రైతులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని బీజేపీ కూటమికి చెందిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) డిమాండ్ చేసింది. ఆ పార్టీకి చెందిన ప్రతినిధి బృందం ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్ను శుక్రవారం కలిసింది. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలపై ఆయనతో చర్చించింది. హర్యానా రైతులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో బీజేపీకి తమ మద్దతుపై పునరాలోచిస్తామని పరోక్షంగా హెచ్చరించింది.
తాజావార్తలు
MOST READ
TRENDING