Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పదేండ్ల పాలన వైఫల్యాలు అన్నీ ఇన్నీ కావని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ అన్నారు. మోదీ హయాంలో దేశంలో ధరలు ఆకాశాన్ని అంటగా, యువత ఉద్యోగాలు లేక సతమతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక అవినీతిలో కాషాయ పార్టీ నేతలు రికార్డులు బ్రేక్ చేస్తున్నారని ఆరోపించారు. అవినీతిలో రికార్డులు బ్రేక్ చేస్తున్న నేతలంతా బీజేపీలో ఉన్నారని, అయినా దేశ ప్రధాని మోదీ ఎన్నికల్లో రికార్డుస్ధాయి ఫలితాలు సాధిస్తామని ప్రగల్బాలు పలకడం సిగ్గుచేటని జితూ పట్వారీ ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల మంటతో సామాన్యుడు బతికే పరిస్ధితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు రాబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :
Hanuman | జయ హనుమాన్.. సాధకులకే కాదు, సామాన్యులకూ మహా భగవాన్