న్యూఢిల్లీ: ఇండియాలో జియో నెట్వర్క్ డౌన్( Jio Down ) అయింది. నెట్వర్క్ సరిగా రావడం లేదని యూజర్లు భారీగా ఫిర్యాదు చేస్తున్నట్లు డౌన్డిటెక్టర్ చూపించింది. కొందరు యూజర్లకు ఈ సమస్య ఎదురైంది. ఈ నెట్వర్క్ డౌన్ అనేది ఒక్క ప్రాంతానికే పరిమితమా లేదంటే దేశమంతా ఉందా అన్నదానిపై జియో నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. నెట్వర్క్ సరిగా రావడం లేదని కొందరు యూజర్లు ట్విటర్ ద్వారా కూడా ఫిర్యాదు చేశారు.
ఇండియాలో ట్విటర్లో #jiodown ట్రెండింగ్లో ఉంది. డౌన్డిటెక్టర్లో 4 వేల మందికిపైగా యూజర్లు జియో నెట్వర్క్పై రిపోర్ట్ చేశారు. బుధవారం ఉదయం నుంచీ ఈ సమస్య ఎదురవుతున్నట్లు కొందరు చెప్పారు. జియో అధికారిక కస్టమర్ సపోర్ట్ హ్యాండిల్ @JioCareకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే అప్పుడప్పుడూ సమస్య వస్తోందని, దీనిపై తమ టీమ్స్ పని చేస్తున్నాయని జియో సమాధానమిచ్చింది.