ముంబై, నవంబర్ 25: గుజరాత్లోని మొత్తం 33 జిల్లాల్లో జియో ‘ట్రూ 5జీ’ సేవలు అందుబాటులోకి వచ్చా యి. అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన గుజరాత్ దేశంలోనే మొదటి రాష్ట్రమని ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సంస్థ శుక్రవారం పేర్కొన్నది.
గుజరాత్లో 100 శాతం జిల్లా హెడ్క్వార్టర్లు తమ 5జీ నెట్వర్క్తో కనెక్ట్ అయ్యాయని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాశ్ ఎం అంబానీ పేర్కొన్నారు. దీంతో దేశంలో మొత్తంగా 46 నగరాలు/పట్టణాల్లో ప్రజలకు జియో 5జీ సర్వీసు వినియోగంలోకి వచ్చింది. నవంబర్ 23న పుణెలో 5జీ సేవలను ప్రారంభించింది.