Sudivya Kumar Sonu | జార్ఖండ్(Jharkhand )ముక్తి మోర్చా పార్టీ (JMM) సీనియర్ నాయకుడు, సాంకేతిక విద్యా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను(56) గుండెపోటుతో మరణించారని ఆ పార్టీ ఆదివారం తెలిపింది. శనివారం రాత్రి అస్వస్థతకు గురైన మంత్రిని(Sudivya Kumar Sonu )రాంచీలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో గుండెపోటుతో (cardiac arrest) ఆయన కన్నుమూశారు.
సోను 2019లో గిరిడీహ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఉన్నత విద్య, పట్టణాభి వృద్ధితో పాటు పర్యాటకం, కళలు, సాంస్కృతికం, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సోను మృతిపై సీఎం హేమంత్ సోరెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయననో విశ్వసనీయ సహచరుడు, మార్గదర్శి, జార్ఖండ్ ఉద్యమానికి అంకితమైన నేతగా స్మరించుకున్నారు సోరెన్. మరోవైపు.. మంత్రి మృతిపై జేఎమ్ఎమ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. జేఎమ్ఎమ్ పార్టీ సహా ప్రభుత్వానికి, జార్ఖండ్కు ఇది తీరని లోటు అని పేర్కొంది.
ज़िंदगी की क्षणभंगुरता…
कल तक जो साथी हमारे बीच थे, आज उनकी स्मृतियाँ ही हमारे साथ हैं। जीवन की अनिश्चितता हमें एक बार फिर गहरे दुःख और शोक में छोड़ गई है।
झारखंड मुक्ति मोर्चा के समर्पित साथी एवं झारखंड सरकार के मंत्री सुदिव्य कुमार के असामयिक निधन से पूरा झामुमो परिवार… pic.twitter.com/CqsHItNpzR
— Jharkhand Mukti Morcha (@JmmJharkhand) September 6, 2026