Jharkhand | జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో చంపయీ ప్రభుత్వం కొలువుదీరింది. శుక్రవారం ఉదయం రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా చంపయీ సోరెన్ (Champai Soren) ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం అనంతరం పదిరోజుల్లో ఆయన అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 5వ తేదీన బలపరీక్షకు (Floor Test) వెళ్లనున్నట్లు జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గులామ్ అహ్మద్ మీర్ శనివారం తెలిపారు.
అదే రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. రెండు రోజులపాటు జరిగే ఈ అసెంబ్లీ సెషన్లో భాగంగా తొలిరోజు బలపరీక్ష ఉంటుందని ఆయన వెల్లడించారు. బలపరీక్ష వరకూ ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో సురక్షిత ప్రాంతంలో వారిని ఉంచినట్లు వెల్లడించారు.
కాగా, బలపరీక్ష నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారకుండా జేఎంఎం (JMM) చర్యలు చేపట్టింది. ఇందుకోసం తమకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ హైదరాబాకు తరలించింది. ఝార్ఖండ్లోని సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలంతా శుక్రవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న విషయం తెలిసిందే.
Also Read..
Karnataka | దారుణం.. టిఫిన్ పెట్టలేదని తల్లిని హత్య చేసిన కుమారుడు
LK Advani | అద్వానీకి భారతరత్న.. ప్రకటించిన ప్రధాని మోదీ
Arvind Kejriwal | కేజ్రీవాల్ ఇంటికి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు