Karnataka | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అన్నం పెట్టలేదన్న కారణంతో తల్లిని కన్న కొడుకే దారుణంగా హత్య చేశాడు (teen kills mother). ఈ ఘటన ముల్బాగల్ పట్టణం (Mulbagal town)లో శుక్రవారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో నివాసం ఉండే 18ఏళ్ల మైనర్ ఉదయం 7 గంటల సమయంలో కళాశాలకు వెళ్లేందుకు రెడీ అయ్యాడు. ఆ సమయంలో తన తల్లిని టిఫిన్ (breakfast) పెట్టమని అడిగాడు. అందుకు తల్లి నిరాకరించింది. నువ్వు నా కొడుకువే కాదంటూ నిందించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మైనర్ బాలుడు ఐరన్ రాడ్తో తల్లి తలపై బలంగా బాదాడు.
దీంతో ఆమె అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆ మైనర్ నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Also Read..
Poonam Pandey | నేను ఇంకా బతికే ఉన్నా : పూనమ్ పాండే
Arvind Kejriwal | కేజ్రీవాల్ ఇంటికి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
Ashok Gehlot | రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్కు కొవిడ్, స్వైన్ ఫ్లూ పాజిటివ్