న్యూఢిల్లీ: దేశం మొత్తం ఎదురు చూస్తున్న జేఈఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ ఖరగ్పూర్ విడుదల చేసిన ఈ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఢిల్లీ ఐఐటీకి చెందిన మృదుల్ అగర్వాల్ తొలి స్థానంలో నిలిచారు. ఓబీసీ-ఎన్సీఎల్ విభాగంలో ప్రియాంశు యాదవ్, జనరల్ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రామస్వామి సంతోష్ రెడ్డి, ఎస్సీ విభాగంలో నందిగామ నిఖిల్, ఎస్టీ కేటగిరీలో బిజిలి ప్రచోతన్ వర్మ, జనరల్ పీడబ్ల్యూడీ విభాగంలో అర్ణవ్ జైదీప్ కల్గుట్కర్, జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ కేటగిరీలో యువరాజ్ సింగ్, ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడీ విభాగంలో గొర్లె కృష్ణ చైతన్య, ఎస్సీ పీడబ్ల్యూడీలో రాజ్కుమార్, ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీలో రవి శంకర్ మీనా తొలి స్థానాల్లో నిలిచారు.
బాలికల విభాగంలో ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన కావ్య చోప్రా ప్రథమ ర్యాంకు సాధించారు. హైదరాబాద్కు చెందిన లోకేశ్ రెడ్డి ఐదో ర్యాంకులో నిలిచారు. గుంటూరుకు చెందిన రుషికేష్ రెడ్డికి పదో ర్యాంకు, విజయవాడకు చెందిన దివాకర్ సాయి 11వ ర్యాంకులో నిలిచారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు మొత్తం 1,51,193 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,41,699 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో 41,862 మంది అర్హత సాధించారు.
వీరిలో 35,410 మంది బాలురు, 6,452 మంది బాలికలు ఉన్నారు. ఈ ర్యాంకుల ఆధారంగా 23 ఐఐటీలు సహా 114 విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విద్యార్థుల కోసం మొత్తం 50 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. రేపు అంటే శనివారం నుంచి విద్యాసంస్థల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈనెల 25 వరకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 27న సీట్ల కేటాయింపు జరగనుంది.