JEE Advanced | చెన్నై, ఏప్రిల్ 10: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్ల షెడ్యూల్ను మార్చినట్టు ఐఐటీ-మద్రాస్ ప్రకటించింది. ఇంతకుముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్ 21 నుంచి 30 వరకు అడ్వాన్స్డ్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది.
ఇప్పుడు ఏప్రిల్ 27 నుంచి మే 7 సాయత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేలా షెడ్యూల్ మార్చారు. పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే మే 26న పరీక్ష జరుగుతుంది.