బిహార్ సీఎం నితీశ్ కుమార్ సీఎం పదవి వదిలేస్తారా? రాజ్యసభకు వెళ్లిపోతారా? కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తోంది. తనకు రాజ్యసభకు వెళ్లడం ఇష్టమని, ఎప్పటికైనా రాజ్యసభకు వెళ్తానని స్వయంగా నితీశే ప్రకటించారు. దీంతో ఆయన రాజ్యసభకు వెళ్లిపోతారన్న ప్రచారం బాగా వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో జేడీయూ అధికారికంగా ఓ ప్రకటన చేసింది. జేడీయూ నేత, మంత్రి సంజయ్ కుమార్ ఝా దీనిపై ఓ ట్వీట్ చేశారు.
నితీశ్ రాజ్యసభకు వెళ్తారన్న ప్రచారం విని ఒక్కసారిగా షాక్కు గురయ్యా. ఇది పూర్తిగా సత్యదూరం. అందులో వాస్తవం లేదు. బిహార్కు సేవ చేయాలని ప్రజలు ఆయన్ను ఆదేశించారు. ముఖ్యమంత్రిగా ఆయన పూర్తి కాలం పదవీ బాధ్యతల్లో వుంటారు. ఎన్డీయే ముఖ్యమంత్రిగా గత ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగారు. ఈ సంకీర్ణ కూటమినే ప్రజలు ఆమోదించారు. బిహార్ ప్రజలకు సేవ చేయాలని, బిహార్ను అభివృద్ధి చేయాలన్నది ఆయన ప్రగాఢమైన ఆకాంక్ష. రాజ్యసభకు వెళ్తారన్న దుష్ప్రచారాన్ని ఆపండి అంటూ మంత్రి సంజయ్ కుమార్ ఝా ట్వీట్ చేశారు.
I'm intrigued at the rumor that Hon CM Shri @NitishKumar is contemplating going to Rajya Sabha! This is mischievous, and far from truth.
Shri Kumar has people's mandate to serve Bihar, and will continue to do so for the full term as Chief Minister. He is not going anywhere!
1/2— Sanjay Kumar Jha (@SanjayJhaBihar) April 1, 2022