గురుగ్రామ్: హర్యానాలోని నుహ్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 9 మంది సజీవ దహనమయ్యారు(Burnt Alive). మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణికులంతా భక్తులే. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. గాయపడ్డవారిని హాస్పిటల్లో ట్రీట్ చేస్తున్నారు.
కేఎంపీ హైవేపై ఉన్న తౌరు వద్ద 2 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. బస్సులో ఉన్న 60 మంది బంధువులే. పంజాబ్లోని హోసియాపూర్కు చెందినవాళ్లు. మథుర-వృందావన్ లో పర్యటించిన తిరిగి వెళ్తున్న సమయంలో బస్సుకు నిప్పు అంటుకున్నది. బస్సులో మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని స్థానిక ప్రజలు గమనించారు. ఈ విషయాన్ని వాళ్లు పోలీసులకు తెలియజేశారు. బస్సులో మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని చూసిన స్థానికులు బస్సును ఆపాలని డ్రైవర్ను కోరారు. కానీ బస్సు ఆగలేదు. ఆ తర్వాత వాళ్లు మోటార్సైకిల్పై బస్సును ఛేజ్ చేశారు. డ్రైవర్కు నిప్పు అంటుకున్న విషయాన్ని చెప్పారు. కానీ ఆ సమయానికి బస్సులో మంటలు వ్యాపించాయి.
విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఆ స్పాట్కు చేరుకున్నారు. మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. కానీ ఆ సమయానికే 8 మంది సజీవ దహనం అయ్యారు. గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేర్పించారు. 9 మంది మరణించారని, దీంట్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని, మరో 15 మంది గాయపడ్డారని, వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, అందరూ నిలకడగా ఉన్నారని, అగ్నిప్రమాదానికి కారణం తెలియదని ఇన్స్పెక్టర్ జితేంద్ర కుమార్ తెలిపారు.
Watch: Eight people were killed and around two dozen injured when a tourist bus caught fire in Nuh, Haryana. pic.twitter.com/on1DG64moK
— IANS (@ians_india) May 18, 2024