లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak), ఆయన భార్య అక్షతా మూర్తి ఆస్తులు గత ఏడాది అమాంతం పెరిగాపోయాయి. గత ఏడాది ఆ ఇద్దరి ఆస్తి సుమారు 120 మిలియన్ల పౌండ్లు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఆ ఇద్దరి ఆస్తి మొత్తం విలువ 651 మిలియన్ల పౌండ్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్కు చెందిన ఐటీవీ ఈ విషయాన్ని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్లోని బిలియనీర్ల ఆస్తులు తరుగుతున్నా.. ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు పెరగడం గమనార్హం. అయితే ఇండియా కంపెనీ ఇన్ఫోసిస్లో అక్షతా మూర్తికి ఎక్కువ షేర్లు ఉన్న కారణంగా వాళ్ల ఆస్తులు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఆ కంపెనీలో ఉన్న అక్షత షేర్లు సుమారు 108.8 మిలియన్ల పౌండ్లకు పెరిగినట్లు భావిసత్ఉన్నారు. సునాక్ దంపతులతో పాటు కింగ్ ఛార్లెస్ ఆస్తులు కూడా పెరిగాయి. గత ఏడాది 600 మిలియన్ల పౌండ్ల నుంచి 610 మిలియన్ల పౌండ్లకు పెరిగింది.