JD(U) : బిహార్లో మహాకూటమిని నుంచి బయటకు వచ్చి ఎన్డీయే సర్కార్ ఏర్పాటుకు సీఎం నితీష్ కుమార్ సన్నద్ధమైన క్రమంలో కాంగ్రెస్పై జేడీ(యూ) తీవ్ర విమర్శలు గుప్పించింది. బిహార్లో విపక్ష ఇండియా కూటమి పతనానికి కాంగ్రెస్ కారణమని ఆరోపించింది. విపక్ష కూటమి నాయకత్వాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని కాంగ్రెస్ కోరుకుంటోందని దుయ్యబట్టింది.
ఇండియా కూటమి నాయకత్వాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకునే కుట్రలో భాగంగానే విపక్ష కూటమి ప్రధాని అభ్యర్ధిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పేరును తెరపైకి తీసుకువచ్చిందని జేడీ(యూ) ప్రతినిధి కేసీ త్యాగి ఆరోపించారు. ఇక బిహార్లో జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ సారధిగా నితీష్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నితీష్ కుమార్తో పాటు బీజేపీకి చెందిన ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా పలువురు మంత్రులూ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పట్నా చేరుకున్నారు. ఇక బిహార్లో నితీష్ కుమార్ సారధ్యంలోని జేడీ(యూ), బీజేపీ కూటమి ప్రభుత్వం లోక్సభ ఎన్నికల అనంతరం కుప్పకూలుతుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేదని ఆయన స్పష్టం చేశారు.
Read More :