Jammu And Kashmir : జమ్మూ కాశ్మీర్లో శుక్రవారం ఎన్కౌంటర్ జరిగింది. బుద్గాం జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీని ప్రకారం.. ఆపరేషన్ అష్దర్ పేరుతో జమ్మూ కాశ్మీర్లో తాజా ఆపరేషన్ ప్రారంభమైంది.
జమ్మూ కాశ్మీర్లోని, బుద్గాం జిల్లా, అష్దర్ గాలి ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో అనుమానాస్పద ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కలిసి సంయుక్తంగా శుక్రవారం సోదాలు ప్రారంభించారు. ఆపరేషన్ అష్దర్ పేరుతో తనిఖీ, భద్రతా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు.
OP ASHDAR, Budgam
Based on specific intelligence input, a Joint Search Operation was launched by #IndianArmy, @JmuKmrPolice and @crpf_srinagar in general area Ashdar Gali, Budgam.
Vigilant troops observed suspicious activity and upon being challenged, terrorists opened fire,…
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) September 4, 2026
దీంతో భారత భద్రతా బలగాలు కూడా వారిపై ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వద్ద నుంచి ఏకే రైఫిల్, కొన్ని ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఉగ్రవాదుల కోసం ఇంకా గాలింపు కొనసాగుతోందని సైన్యం వివరించింది. ఉన్నతాధికారులు పరిస్తితిని సమీక్షిస్తున్నారు.