న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఇండి యా, పాకిస్థాన్ మధ్య వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోకపోతే గాజా, పాలస్తీనాకు పట్టిన గతే కశ్మీర్కు పడుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. పూంఛ్లో ఇటీవల ఉగ్ర దాడి అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘చర్చలెక్కడ? నవాజ్ షరీఫ్ పాక్ ప్రధాని కాబోతున్నారు. భారత్తో చర్చలకు సిద్ధమని వారంటున్నారు. కానీ చర్చించడానికి మనం ఎందుకు సిద్ధంగా లేము?’ అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు రాజౌరీ-పూంఛ్ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ మంగళవారం ఏడో రోజుకు చేరుకుంది.