Jaishankar | పాక్, చైనాతో సంబంధాలపై కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ప్రపంచం చాలా పోలరైజ్డ్ ప్రపంచమని, ప్రపంచ వేదిక చాలా సవాల్తో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. అమెరికాతో మన సంబంధాలు చాలా బాగున్నాయన్న ఆయన.. ప్రధాని మోదీ అమెరికా పర్యటన అత్యంత ఫలప్రదమైందన్నారు. భాగస్వామ్య లక్ష్యాలను కొనసాగించేందుకు సానుకూల దృక్పథంలోకి వెళ్లామన్నారు.
ప్రస్తుతం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడం మన ముందున్న అతిపెద్ద సమస్య అన్న ఆయన.. ఇందుకు గతం కంటే ఎక్కువ ఆశాజనకంగా ఉన్నామన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా రష్యాతో సంబంధాలు స్థిరంగా ఉన్నాయన్నారు. మాస్కోతో సంబంధాలను కేవలం రక్షణకే పరిమితం చేయడం పొరపాటని, ఆ దేశంతో ఆర్థిక సంబంధాలు సైతం మెరుగయ్యాయన్నారు. ఈ సందర్భంగా దయాది పాక్ లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలో చేశారు. ఉగ్రవాదాన్ని అరికట్టే వరకు పాక్తో చర్చలను అనుమతించేది లేదన్నారు.
పాక్ సరిహద్దు ఉగ్రవాద విధానాన్ని అనుసరిస్తున్నంత కాలం సంబంధాలు సాధ్యం కావాన్నారు. చైనాతో సంబంధాలపై స్పందిస్తూ.. డ్రాగన్ దేశంలో సంబంధాలో ఓ మలుపులో ఉన్నాయన్నారు. చైనా పెద్ద పొరుగుదేశమని, మెరుగైన సంబంధాల కోసం రెండువైపుల నుంచి సమాన ప్రయత్నాలు ఉండాలన్నారు. పరస్పర ప్రయోజనాలను గౌరవించుకోవాల్సి ఉంటుందన్నారు. సరిహద్దు పరిస్థితి అంతిమంగా సంబంధాల స్థితిని నిర్ణయిస్తుందన్న ఆయన.. చైనాతో ‘సరిహద్దు పరిస్థితి ఇప్పటికీ అసాధారణంగానే ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు.