న్యూఢిల్లీ : నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) పేరు మార్చడం పట్ల మోదీ సర్కార్పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) మండిపడ్డారు. ఎన్ఎంఎంఎల్ అనేది ప్రపంచ మేథో భాండాగారమని, పుస్తకాలు, ఆర్కైవ్స్కు పెట్టింది పేరని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చిల్లర రాజకీయాలు, ప్రతీకారంతో రగులుతున్నారని ట్విట్టర్ వేదికగా జైరాం రమేష్ ఆక్షేపించారు.
ఈ ప్రతిష్టాత్మక మ్యూజియానికి నెహ్రూ పేరును తొలగించి ప్రధానమంత్రి మ్యూజియం అండ్ సొసైటీగా నామకరణం చేయడం తగదని వ్యాఖ్యానించారు. 59 ఏండ్లకు పైగా ఎన్ఎంఎంఎల్ అంతర్జాతీయ మేధో భాండాగారంగా విలసిల్లుతోందని, ఆధునిక భారత నిర్మాత వారసత్వ పరంపర కొనసాగిస్తోందని అయితే ఓ చిన్న వ్యక్తి తనకు తాను విశ్వగురుగా చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ నేత ఎద్దేవా చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్ఎంఎంఎల్ సొసైటీ నడుస్తుండగా సభ్యులుగా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ సహా 29 మంది సభ్యులున్నారు.
Read More
Kupwara Encounter | కుప్వారాలో ఎన్కౌంటర్.. ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతం