న్యూఢిల్లీ: విపక్షాల ‘ఇండియా’ కూటమిని చూసి ప్రధాని మోదీ గిలగిలా కొట్టుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. విపక్ష కూటమిపై ప్రధాని నీచమైన మాటలను ప్రయోగిస్తున్నారని విమర్శించారు.‘ఎన్డీఏ..అంటే నేషనల్ డిఫమేషన్ అలయన్స్ (జాతీయ పరువుతీసే కూటమి).
సమస్యలు, సంక్షోభాలు తనను చుట్టుముట్టినవేళ, వాటికి సమాధానం చెప్పుకోలేక విపక్షాలపై నిందలు వేయటం ప్రధానికి అలవాటు. డిస్టార్ట్ (వక్రీకకరణ), డైవర్ట్ (దారిమళ్లింపు), డినై (నిరాకరణ), డీఫేమ్ (నిందలు)లను ఎంచుకొని తప్పించుకుంటారు’ అని జైరాం రమేశ్ ప్రధానికి కౌంటర్ ఇచ్చారు.