న్యూఢిల్లీ: గుజరాత్లో లోక్సభ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల (AAP’s Star Campaigners) జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విడుదల చేసింది. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్తోపాటు కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భవంత్ మాన్ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు. గుజరాత్లో లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల కమిషన్ (ఈసీ)కు ఆప్ సమర్పించింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్ పేర్లు కూడా ఉన్నాయి. అయితే రాజ్యసభ సభ్యులైన హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ పేర్లు జాబితాలో మిస్ అయ్యాయి.
కాగా, గుజరాత్లోని 26 లోక్సభ స్థానాలకుగాను కేవలం రెండు సీట్లలో ఆప్ పోటీ చేస్తున్నది. బరూచ్ నుంచి చైతర్ వాసవ్, భావ్నగర్ నుంచి ఉమేష్ మక్వానాను బరిలోకి దింపింది. ‘ఇండియా’ బ్లాక్తో సీట్ల పంపిణీ కారణంగా మిగతా 24 స్థానాలను కాంగ్రెస్ పార్టీకి వదిలేసింది.