న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం లోక్సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పెదవి విరిచారు. ప్రధాని ప్రసంగం తనకు ఏమాత్రం సంతృప్తినివ్వలేదని చెప్పారు. అదానీ అంశాన్ని అంతమంది సభ్యులు లేవనెత్తినా ప్రధాని మాత్రం ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని విమర్శించారు.
అదానీ షెల్ కంపెనీలపైన, బినామీ ఆస్తులపైన విచారణకు విపక్షాలు డిమాండ్ చేసినా ప్రధాని పట్టించుకోలేదని రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. ప్రధానికి గౌతం అదానీకి మధ్య దోస్తీ లేకపోతే.. అతని షెల్ కంపెనీల వ్యవహారంపై ఎంక్వయిరీ జరిపిస్తామని ప్రధాని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రధాని, గౌతం ఆదానీ దోస్తులని.. అందుకే అతనికి ఏ సమస్య రాకుండా ప్రధాని మోదీ కాపాడుతున్నారని రాహుల్గాంధీ ఆరోపించారు.