న్యూఢిల్లీ: ఆర్థిక, న్యాయపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్న ఎడ్యు-టెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్ మరో 5,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సంస్థ ఈ ఏడాదిలో ఇప్పటికే వేలాది మందిని తొలగించింది. నిర్వహణను మెరుగుపరచుకోవాలని ఇచ్చిన సలహాలను ఈ సంస్థ యాజమాన్యం పెడచెవిన పెట్టడం వల్లే ఈ పరిస్థితి దాపురించినట్లు ఇన్వెస్టర్ ప్రోసుస్ ఎన్వీ తెలిపింది.
ఈ సంస్థ వ్యాపార, కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించడంతో గత నెలలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రత్యూష అగర్వాల్, ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ రాజీనామా చేశారు.