ఢాకా: బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు ఓడి సిరీస్ కోల్పోయిన శ్రీలంక ఆఖరి పోరులో ఓదార్పు విజయం దక్కించుకుంది. శుక్రవారం జరిగిన పోరులో మొదట లంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేయగా.. అనంతరం బంగ్లా 42.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక కెప్టెన్ కుషాల్ పెరెరా (120) సెంచరీతో కదం తొక్కగా.. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యఛేదనలో మహ్ముదుల్లా (53), మొసద్దక్ హుసేన్ (51) అర్ధశతకాలు బాదినా.. మిగిలినవాళ్లు విఫలమవడంతో బంగ్లాకు పరాజయం తప్పలేదు. లంక బౌలర్లలో దుశ్మంత చమీరా 5 వికెట్లు పడగొట్టాడు.